వైద్యాధికారులు, ఐసిడిఎస్ సి డి పి ఓలు, సూపర్ వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జెడ్పి సి.ఈ.ఓ. ప్రియాంక. (కరీంనగర్ జిల్లా)

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలి:

అర్హులైన వారికి వేగవంతంగా ప్రికాషన్ డోస్ వేయించాలి:

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్
00000

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ వైద్య అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజన్ వ్యాధులపై వైద్యాధికారులు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు. ప్రధానంగా వర్షాలు పడుతున్నందున నీటి నిల్వలు ఉండకుండా చూడాలని, దోమ లార్వాలు అభివృద్ది చెందకుండా చూడాలని ఆదేశించారు. మురికి గుంతలు, డ్రైనేజీలు ఉన్నట్లైతే ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. గర్భీణీల మరియు ఇతర సాధారణ మహిళలకు రక్త పరీక్షలు చేయించి రక్త హీనతను గుర్తించాలని వైద్యాధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. రక్తహీనత ఉన్నవారికి ఐరన్ ఫోలిక్ మాత్రలు నిరంతరం ఇచ్చి పర్యవేక్షించాలని సూచించారు. ఏ షీల్డ్ యాప్ లో డౌన్ లోడ్ చేసి మొబైల్ యాప్ ద్వారా తమకు తామే పర్యవేక్షించే విధంగా చూడాలని సూచించారు. ఇంటింటి సర్వే చేస్తూ కోవిడ్ ప్రికాషనరీ డోస్ ఇవ్వాలని, ప్రతి ఏ.ఎన్.ఎo కనీసం 25 మందికి డోసులు వేయాలని సూచించారు. రెండు మోతాదులు వేసుకున్న 6 నెలల తర్వాత ప్రికాషనరీ మోతాదు అర్హులైన వారందరికి వేయించాలని సూచించారు.

ఈ సమావేశంలో జెడ్పి సిఈఓ ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సిడిపిఓలు, అంగన్ వాడీ సూపర్ వైజర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

Share This Post