శ్రీ Ankith, IAS ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ ఎటునాగారం గారి ఆదేశానుసారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఎటురునాగారం ఆధ్వర్యంలో మండల ల వారీగా జాబ్ మేళాలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం YTC నందు ఈరోజు అనగా 31-05-2023 బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు YTC ఏటూరు నాగారం నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 06 ప్రైవేట్ కంపెనీలు వివిధ ఉపాధి రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళలో జిల్లా లోని పలు మండల నుండి 94 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కాగా 49 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అవటం జరిగింది. ఎంపిక కాబడిన అభ్యర్థుల కంపెనీల వారీగా వివరాలు
1) ఎస్ఎస్ బయో ప్లాంటేషన్ 05 మంది
2) సన్ షైన్ హెల్త్ కేర్ 04 మంది
3) G4S సెక్యూరిటీ కి 04 మంది
4) గూగుల్ పే 04 మంది
5) హేటిరో ఫార్మా 10మంది
6) ఈక్విటీ గ్రూప్ 15 ఎంపిక అవటం జరిగింది.
ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయటం జరిగింది.
ఈ యొక్క ఎంపిక కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు 15వేల నుండి 35 వేల వరకు వారి యొక్క అర్హతను బట్టి సంబంధిత కంపెనీ వారు నిర్ణయించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమలో
శ్రీ జే వసంతరావు గారు APO(GL) ఐటీడీఏ ఎటునాగారం
శ్రీ కొండలరావు జేడియం గారు,,
జేఆర్పీలు, మేకల పాపారావు, సరస్వతి,
కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.