సిద్ధిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి గ్రామంలో రైతు వేదిక, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్, మహిళా మండలి భవనం, డంపింగ్ యార్డు, ఓపెన్ జిమ్, పల్లె ప్రకృతి వనం, గౌడ సంఘం, శాశ్వత నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేసిన మంత్రి హరీష్ రావు.
– ఎన్ సాన్ పల్లి గ్రామము లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు గారు…
– కాంగ్రెస్ హయాంలో మడి ఎండకుంట రైతు పంట పండించారా ?
– కాళేశ్వరం పై విపక్షలా దుష్ప్రచారం.
– కండ్లు ఉండి ..కండ్లు లేని కాబోదిల్లా .. చెవులు ఉండి.. చెవులు లేని చెవిటి వాళ్ళ ల ప్రతిపక్షాల తీరు..
– కాంగ్రెస్, బీజేపీ నేతలు హైదరాబాద్ లో కూర్చోని నీళ్లే రావడం…
లేదంటున్నారు.
– నాలుగేళ్లలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ కట్టి గోదారి నీళ్లతో రైతుల కాళ్ళు కడుగుతున్నాం.
– మహారాష్ట్రలో 8 గంటల కరెంటే.. అదీ కూడా గ్యాప్ లతో ఇస్తున్నారు. తెలంగాణ బార్డర్ లో మహారాష్ట్ర రైతులు జాగలు కొంటున్నారు.. బోర్లు వేసి నీళ్లు తరలించుకుంటున్నారు.. ఇది కాదా తెలంగాణ అభివృద్ధి.
– మహారాష్ట్రలో మొన్నటి దాకా బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. ఇదీ వాళ్ల అభివృద్ధి..
– ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ లో జూటమాలతో గందరగోళం సృష్టిస్తున్నారు.
– వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని ప్రగతి సాధిస్తున్నాం.
– వడ్లు కొనుడొక్కటే కేంద్రం పని.. నెహ్రు కాలం నుంచి కొంటున్నారు.. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వద్దు కొనమంటూ రైతుల ఉసురు పోసుకుంటున్నది.
– పంజాబ్ లో కొంటరట.. మన వడ్లు కొనరట..
– వడ్లు కొనమంటే తెలంగాణ ఉద్యమిస్టది.. నీ మెడలు వంచి వడ్లు కొనిపిస్తాం.. ఇక్కడ ఇంటికో ఉద్యమకారుడు ఉన్నాడు.
– మద్దతు ధర ఇచ్చి వడ్లు కొనేదాక వదిలేదే లే..
– పామ్ ఆయిల్ తోటలతో రైతులకు లాభదాయకం..
– ఆ దిశగా రైతులు ఆలోచన చేయాలి..
– వంద కోట్లతో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం.
– 80 వేల కోట్ల పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼