సి.పి. ఆర్ ద్వారా గుండెపోటుకు గురైన వారి ప్రాణాలు కాపాడవచ్చు:: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్నవారిని సిపిఆర్ నిర్వహించడం ద్వారా రక్షించవచ్చని ఆ దిశగా ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సిపిఆర్ ట్రైనింగ్ కార్డియో పల్మనరీ రిసోసియేషన్ శిక్షణ ప్రజా ప్రతినిధులకు, జిల్లాలోని అధికారులకు ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ అనంతరం చాలామంది గుండె నొప్పి కారణంగా మృతి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందరికీ సిపిఆర్ ప్రక్రియ పై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఒక వ్యక్తికి సడన్ కార్డియాక్ అరెస్టు అయినప్పుడు వారికి సి పి ఆర్ ,
ఏ ఈ డి కనుక మనం ఇచ్చినట్లయితే వారిని ప్రమాదం నుండి కాపాడగలుగుతామని అన్నారు. ఇది లేకపోవడం వలన మరణాలు సంభవిస్తున్నాయి, అందువలన సిపిఆర్ ట్రైనింగ్ సడన్ కార్డియాక్ అరెస్టు అయినప్పుడు ప్రథమ సహాయం అందించాలన్నారు. దీనికై ప్రతి ఉద్యోగికి ఈ శిక్షణ అవసరం ఉందని తద్వారా ప్రాణాలు కాపాడవచ్చు అని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ప్రాణానికి మించి ఏది లేదని, మన చుట్టుప్రక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడొచ్చని అన్నారు. ఈ దిశగా ప్రతి మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు.

ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ శ్రీకాంత్ శిక్షణ ఇవ్వడం జరిగింది. సి పి ఆర్ కార్డియో పల్మనరీ రీసోసియేషన్ అనేది సడన్ కార్డియాక్ అరెస్టు, స్పందనలో కీలకమైనదని,గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, మెదడు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం లేదా మరణం నిమిషాల్లో సంభవిస్తుందని తెలిపారు.

సిపిఆర్ అనేది అత్యవసర వైద్య సేవలు వచ్చేవరకు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని అందించడంలో సహాయపడే రక్షక సాంకేతికత యొక్క లక్ష్యం చాతి నొక్కడం మరియు రెస్కు శ్వాసలను అందించడం ద్వారా శరీరమంతా ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని అందిస్తుందని ఇది మెదడు మరియు ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుందని, నష్ట తీవ్రతను తగ్గిస్తుందని, బ్రతికే అవకాశాలను పెంచుతుందని తెలిపారు.

జీవించి ఉన్న లక్షణాలు కనిపించని వ్యక్తులపై సిపిఆర్ చేయబడుతుంది.
జీవించి ఉన్న లక్షణాలు కనిపించని బాధితుడిని సిపిఆర్ చేస్తే వారి జీవితాన్ని రక్షించగలం. జీవించి ఉన్న సంకేతాలు లేవని మీరు నిర్ధారించిన తర్వాత మీరు చాతినొక్కడం ద్వారా గుండె నుండి శరీర భాగాలకు రక్తప్రసరణ అందించడం, హెడ్ టిల్ట్ చిన్ను లిఫ్ట్ నైపుణ్యం ద్వారా వాయు మార్గాన్ని తెరవడం శ్వాస కోసం తనిఖీ చేయడం, కృత్రిమ శ్వాసను కల్పించడం, సిపిఆర్ విషయంలో 30 సార్లు చాతినొక్కడం మరియు రెండు వెంటిలేషన్ తో చేయడం జరుగుతుందని శిక్షకులకు పవర్ ప్లాంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది.

ఈ యొక్క శిక్షణలో ఎస్పీ గౌస్ ఆలం, గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవి గణేష్, డిఆర్ఓ రమాదేవి, ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి , జిల్లా అధికారులు, వైద్యాధికారులు, కలెక్టరేట్ ఆవరణంలోని కార్యాలయల సిబ్బంది, వైద్య సిబ్బంది , ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post