పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 13:–
సోమవారం వివిధ సమస్యలతో జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆయన చాంబర్లో స్వయంగా అర్జీలను స్వీకరించారు.
అర్జీదారులు ఆయా సమస్యలకు సంబంధించి చెప్పిన వివరాలను వినడంతో పాటు , ప్రతులను పరిశీలించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల నుండి నుండి వచ్చిన ప్రజలు పెన్షన్స్, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్స్, భూ సమస్యలపై అర్జీలను అందజేశారు. భూ సమస్యలకు సంబంధించి కార్యాలయాల చుట్టూ తిరగవద్దని, మీసేవ ద్వారా ధరణిలో దరఖాస్తు చేయాలని కలెక్టర్ సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.