స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్బంగా అప్పటి స్వాతంత్ర్య సమారా యోధులను స్మరించుకోవలసిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ డా. చేతన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం ఉదయం మినీ స్టేడియం నుండి అంబేద్కర్ కూడలి వరకు నిర్వహించిన 2 కి.మీ పరుగును జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 6.30 గంటలకు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కె రన్ లో కళాశాల విద్యార్థులు, యువతి యువకులు, క్రీడా ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతి సమైక్యతను చాటుతు దేశ ప్రజలు, యువతలో జాతీయ సమైక్యత భావన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, ఒకే విధంగా ఉంటుందని స్త్రీలకు వేరు పురుషులకు వేరు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉండాలని పేర్కొన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఈ స్వేచ్ఛ అనేది ఎంతో అవసరమని స్వేచ్ఛ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. మన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతాం కాబట్టి యువతి, యువకులు అందరూ స్వేచ్ఛ సమానత్వం భావనతో బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారత దేశం లో ఉన్న యువత ప్రపంచం లో మరెక్కడా లేదని తెలిపారు. యువత ప్రతిరోజు 30 నిమిషాల పాటు యోగ, ధ్యానం, వ్యాయామం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల దేశం మొత్తం ఆరోగ్యవంతమైన భారతదేశం గా ఆవిష్కరించబదుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి కోట నాయక్, డీఈవో. లియాకత్ , SLDC. ప్రిన్సిపల్ మెర్సి ,నారాయణపేట తహసిదర్, వ్యయమ ఉపాద్యాయులు మరియు యువతీ, యువకులు, విద్యార్థులు కళాశాల లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు.