హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జనరల్ అబ్జార్వర్ డాక్టర్ ఓం ప్రకాష్ .

ఈవీఎం ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

ర్యాండమైజేషన్ లో పాల్గొన్న ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్
000000

హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ను కలెక్టర్ ఆర్ వి. కర్ణ న్ నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాష్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన ఇదివరకే పూర్తిచేశామని తెలిపారు. ప్రస్తుతం 732 బ్యాలట్ యూనిట్లు, 703 కంట్రోల్ యూనిట్లు, 491 వివి ప్యాట్ల నుంచి ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసిన 427 బ్యాలెట్ యూనిట్లు, 427 కంట్రోల్ యూనిట్లు, 458 వి వి ప్యాట్లను హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తామని కలెక్టర్ తెలిపారు. పసుపు పచ్చ రంగు స్టిక్కర్ వేసిన ఈవీఎంలను ఎన్నికల శిక్షణకు ఉపయోగిస్తామని, ఆకుపచ్చ రంగు స్టిక్కర్లు వేసిన ఈవీఎంలను ఎన్నికలలో వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. 100 వి వి ప్యాట్లను రిజర్వులో ఉంచుతామని తెలిపారు.

స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ- ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు. ర్యాండమైజేషన్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళినీ కఠినంగా అమలు చేస్తామని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చును రోజువారీగా చూపెట్టాలని తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఓటర్లను ప్రలోభపెట్టేలా పోటీలో ఉన్న అభ్యర్థులు పంపిణీ చేసే డబ్బు, మద్యం, బహుమతుల పై దృష్టి సారిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై ఉల్లంఘన జరిగినట్లు తెలిసిన ఎవరైనా సమాచారం అందించాలని తెలిపారు.

ర్యాండమైజేషన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవి శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వై.సునీల్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, మడుపు మోహన్, కల్యాడపు ఆగయ్య, మహమ్మద్ అఖిల్ ఫిరోజ్, గాలి అనిల్ కుమార్ , జి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post