హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు త్వరలో మెట్రో రైల్ వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ అన్నారు.

హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు త్వరలో మెట్రో రైల్ వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్  అన్నారు.

.  శుక్రవారం  మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31  కిలో మీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు సి ఎం కె సి ఆర్ శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం వందకు వంద శతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ ఎం డి ఏ, జి ఎం ఆర్ నిధులతో పనులు ప్రారంభిస్తున్నాం అన్నారు. హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సి ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్ ను విస్తరించనున్నట్టు ప్రకటించారు.  దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించిన లేకున్నా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని సి ఎం  స్పష్టం చేసారు.

            మన హైదరాబాద్ సుప్రసిద్ధమైన నగరం, చెన్నై కంటే దేశంలోని ఇతర అనేక నగరాల కంటే  ముందుగా అంటే 1912 లోనే ఎలక్ట్రిసిటీ వచ్చిన సిటీ. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి 1927 లో అక్కడ కరెంట్ వచ్చిందని తెలిపారు. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అందర్నీ అక్కున చేర్చుకున్న విశ్వనగరం హైదరాబాద్ అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ కు కనెక్టివిటీ కోసం మెట్రోకు శంకుస్థాపన చేసుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. అన్నిభాషలు, సంస్కృతులు కలిగి ఉన్నవారు హైదరాబాద్ లో ఉన్నారు. అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి తెలుగు. ఐతే సమైక్య పాలకుల వాళ్ళ చాల భాధలు అనుభవించాం, కరెంట్ కోసం ధర్నాలు, మంచినీటి కష్టాలు అనుభవించామన్నారు.ఇప్పుడు అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి అన్నారు. క్షణం పాటు కరెంట్ పోనీ పరిస్థితి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చమని సీఎం ప్రకటించారు.  పరిశ్రమల రంగంలో రాష్ట్రము దూసుకుపోతోందని కె సి ఆర్ తెలిపారు. అండర్ పాసులు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీర్చమన్నారు. ఎయిర్ పోర్ట్ లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. రెండో రన్ వే కూడా వస్తుందని ఆ విధంగా ఈ మెట్రో రైల్  కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.  ఇప్పుడు హైద్రాబాద్లో కొన్ని ప్రాంతాలకే పరిమితం ఐన మెట్రో రైల్ ఓ ఆర్ ఆర్ చుట్టూ మెట్రో విస్తరించడం చాలా మంచిదన్నారు. ఓ ఆర్ ఆర్ తర్వాత హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరిపోయాయన్నారు. మరికొన్ని ఫ్లై ఓవర్ లు, అండర్ పాసులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఓ ఆర్ ఆర్ చుట్టూ మెట్రో రైల్ వస్తే హైదరాబాద్ రూపు రేఖలు మారిపోవడం ఖాయమన్నారు.  

            ఈ కార్యక్రమంలో హోమ్ శాఖా మాత్యులు మహమూద్ అలీ, పరిశ్రమల శాఖామాత్యులు కె.తారక రామారావు, విద్య శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖామంత్రి మల్లారెడ్డి, పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, కేశవా రావు, నామా నాగేశ్వర రావు, నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి  స్థానిక ఎం ఎల్ ఏ ప్రకాష్ గౌడ్, ఎం ఎల్ ఏ లు, ఎం ఎల్ సిలు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ శాఖా అరవింద్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post