07-09-2021: నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్:

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి నియోజకవర్గానికి బయలుదేరుతూ మార్గ మధ్యలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి,ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్,సీ.ఈ సుధాకర్ లతో వర్షాలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు.

పలు అంశాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

“జిల్లాలో భారీ వర్షాలున్నాయన్న వాతావరణశాఖ సూచనల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి.లోతట్టు ప్రాంతాలు,ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతాలు,నిండిన చెరువులపై దృష్టి సారించాలి.రెవెన్యూ,పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి,ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలి.అధికారులు అందరూ డ్యూటీలోనే ఉండాలి.లీవ్ లో ఎవరూ వెళ్లొద్దు.డ్యామేజ్ అయిన రోడ్లు తాత్కాలికంగా ప్రయాణానికి అనుకూలంగా పునరుద్ధరించాలి.రోడ్లపై నీరు పారుతున్నట్లయితే అక్కడే గ్రామ వి.ఆర్.ఏ ని పర్యవేక్షించేలా చూడాలి.విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి.రెవెన్యూ, పంచాయితీ రాజ్,ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లను సమన్వయం చేసుకోవాలి.ఎస్సారెస్పీ నీటి ఇఫ్లో ఔట్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు నాకు తెలియజేయాలి.మహారాష్ట్ర నుండి మరియు నిజాం సాగర్ కూడా నిండటంతో మంజీరా లో కూడా ప్రవాహం పెరిగి ఎస్సారెస్పీ కి ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్ట్ నుండి దిగువకు భారీగా నీటి విడుదల జరుగుతున్నందున దిగువ గ్రామాలను అప్రమత్తంగా ఉంచాలి.అవసరమైన లోతట్టు ప్రాంతాలు వారిని పునరావసాలకు తరలించాలి.”అని మంత్రి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ని ఆదేశించారు.

Share This Post