15 వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను సి.ఎస్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్ట పర్చడం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కొన్నింటిని మండల పబ్లిక్ హెల్త్ యూనిట్ గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, మున్సిపల్ శాఖ కమీషనర్ డా. సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ, వైద్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస రావు, వైద్య విద్యాశాఖ సంచాలకులు రమేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓ.ఎస్.డి. గంగాధర్ తదితరులు హాజరయ్యారు.
You Are Here:
Home
→ 15 వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం.
You might also like:
-
Chief Secretary Santhi Kumari asked the officials to come prepared with all details for the upcoming visit of the Election Commission of India (ECI) officials to the state.
-
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
-
రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జిఓ 58, 59 అమలు, గృహలక్ష్మి, ఆసరా పింఛన్లు, సాంఘిక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ పామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
-
అమెరికా అబర్న్ యూనివర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ ఒప్పందం