ప్రెస్ రిలీజ్. తేది 21.09.2021 సదాశివనగర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. ఎంపీడీవో రాజ్ వీర్ మాట్లాడారు. ఉపాధి హామీ సోషల్ ఆడిట్ 18 గ్రామాలు పూర్తి చేసినట్లు తెలిపారు. 6 గ్రామాల ఆడిట్ నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్రామాల వారీగా జరిగిన ఉపాధి హామీ పనుల వర్క్ ఫైళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ధరణి లో వచ్చిన స్లాట్ బుకింగ్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని కోరారు.Dpro..Kamareddy.