శనివారం నాడు కాన్ఫరెన్స్ హాలులో తన అధ్యక్షతన జరిగిన డిస్టిక్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణా జరగకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఉదయం 6.00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే రవాణా జరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అనుమతులు, రవాణా తీరు పట్ల ప్రతి 15 రోజులకు ఒకసారి విజిలెన్స్ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా…
Category: Bhuvanagiri Yadadri-Press Release
Press Note. 04.02.2023. సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో విద్యార్థులు పాలుపంచుకునేలా చూడాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.
శనివారం నాడు రామన్నపేట జూనియర్ కళాశాల విద్యార్ధినులు CGT కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ వృత్తి విద్యాకోర్సు ద్వారా తయారు చేసిన 30 డ్రెస్సులను భువనగిరి పట్టణం తారకరామనగర్ లోని 2 అంగన్వాడీ సెంటర్ల చిన్నారులకు జిల్లా కలెక్టరు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు రామన్నపేట జూనియర్ కాలేజీ విద్యార్ధినులను అభినందించారు. కష్టపడి చదవాలని, ఇష్టమైన సబ్జెక్టులలో, వృత్తి విద్యాకోర్సులలో అభివృద్ధి సాధించాలని అన్నారు. సామాజిక కార్యక్రమాలలో ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకొని పరస్పర సహకారం అందించుకోవాలని,…
Press note. 3.2.2023. శుక్రవారం నాడు అడ్డగూడురు మండల సందర్శనలో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కృష్ణ చౌళ్ళ రామారం గ్రామం లోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన శుక్రవారం సభలో పాల్గొన్నారు.
ఆరుగురు గర్భిణులు, ఇరవై మంది పిల్లలను ఉద్దేశించి, మండల పరిషత్ అధ్యక్షులు దర్శనాల అంజయ్య, సర్పంచ్ నిమ్మనగోటి జోజి, ఎస్సీ కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ అధికారి శ్యాం సుందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రమౌళి, వార్డు సభ్యులు మందుల కిరణ్ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి, వాళ్లకు, అంగన్వాడి పిల్లలకు అందుతున్న ఆహారం గురించి ఆరా తీసి, ఆ ఆహారాన్ని పరిశీలించడం జరిగింది. అంగన్వాడీ పిల్లలు చాలా చక్కగా వారు నేర్చుకున్న విషయాల గురించి ప్రదర్శించారు…
Press note. 02.02.2023 మన ఊరు మన బడి కార్యక్రమంలో పెండింగ్ ఉన్న పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ కోరారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు మన బడి పనుల పురోగతిని మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులతో ఆయన సమీక్షిస్తూ, ఈనెల 10 లోగా అన్ని ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలల్లో మన ఉరు మన బడి కార్యక్రమంలో భాగంగా పెయింటింగ్ పనులు, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, కిచెన్ షేడ్ , సుందరీకరణ, ఇతర పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభించుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అలాగే జిల్లాలో ఉపాధి హామీ పనులు కూడా…
Press note. 02.2.2023. స్నేహిత కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు.
గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్లు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎండిఓలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లతో జరిగిన రెండవ విడుత స్నేహిత అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా ప్రభుత విప్ మాట్లాడుతూ, స్నేహిత మంచి కార్యక్రమమని, స్నేహిత ద్వారా బాలల సంరక్షణ పట్ల సామాజిక అవగాహన కలిగించడానికి చేపట్టిన కార్యక్రమాలను, స్నేహితను జిల్లాలో కొత్తగా ప్రారంభించిన జిల్లా కలెక్టరు అభినందనీయులని అన్నారు. బాలల…
Press note. 01.02.2023. ప్రయివేటు కార్పోరేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు.
బుధవారం నాడు ఆయన ఎం.ఎల్.సి. ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ లతో కలిసి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా తయారైన భువనగిరి పట్టణం గాంధీనగర్ ప్రాథమికోన్నత పాఠశాల-2 ను ప్రారంభోత్సవం చేశారు. పాఠశాలలోని డిజిటల్ క్లాసు, రీడింగ్ కార్నర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రజా సంక్షేమం…
Press note. 1.2.2023. స్వయం సహాయక సంఘాల పనితీరు జిల్లాలో ప్రశంసనీయంగా ఉందని, రుణాల తిరిగి చెల్లింపు 99 శాతం ఉన్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
బుధవారం నాడు జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్ సంబంధించిన 26 మంది నేషనల్ రిసోర్స్ పర్సన్స్ బృందం జిల్లా కలెక్టర్ గారిని కలిసింది. అంతకు ముందు ఈ బృందం బీబీనగర్ లోని వెంకిర్యాల గ్రామం, భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించారు. బ్యాంకు రుణాల ద్వారా వారు పొందుతున్న జీవనోపాదులను, అలాగే రుణాల తిరిగి చెల్లింపులను స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంది. అనంతరం బృందం…
Press note. 1.2.2023. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించడానికి వచ్చిన 19 మంది సభ్యులు గల నేషనల్ డిఫెన్స్ కాలేజీ ప్రతినిధుల బృంద సభ్యులు బుధవారం నాడు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. బృందంలో ఐదుగురు విదేశీయులు ఉన్నారు.
ఆలయ విశిష్టతలు, ఆలయ పునర్నిర్మాణ రీతులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బృంద సభ్యులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృఢ సంకల్పంతో ఈ కాలంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో, కృష్ణ శిలలతో నిర్మితమైన దేవాలయమని, ఆర్కిటెక్ పనులు అమోఘమని బృందం కొనియాడింది. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, నేషనల్ డిఫెన్స్…
PRESS NOTE 31-1-2023 మంగళవారం నాడు కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితుల పునరావాసం క్రింద అందిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ సర్వే నెం. 107 లో విద్యుత్, నీటి వసతుల ఏర్పాట్లపై భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టరు పమేలా సత్పతి పంచాయితీరాజ్, నీటిపారుదల, ఆర్ డబ్లూఎస్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్ల నిర్మాణానికి కావలసిన విద్యుత్, నీటి వసతి కోసం టెండర్ ప్రక్రియ | పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు. తిమ్మాపూర్ గ్రామంలో గల ఇండ్లకు, స్థలాలకు రావలసిన నష్ట పరిహారం త్వరలోనే ప్రభుత్వం నుండి మంజూరు చేయించి భూనిర్వాసితులకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితులకు గతంలో 655 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 7 లక్షల 61 వేల రూపాయల చొప్పున…
PRESS NOTE. 31-1-2023 జంతు సంరక్షణపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి వుండాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంతు సంక్షేమ పక్షోత్సవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కెబిజివి విద్యార్ధినులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్దినీ విద్యార్థులకు మంగళవారం నాడు కలెక్టరేటు మీటింగ్ హాలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ కరుణ, ప్రేమ కలిగి వుండాలని, జంతు సంరక్షణ పట్ల ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కలిగి…