శనివారం రోజు హరిహర కళ భవన్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సు లోహోం శాఖమంత్రి మాట్లడుతూ కెసిఆర్ మరో అంబేద్కర్ లాంటి వారని అన్నారు. ఆర్ధికంగా దళిత కుటుంబాలు బాగుపడాలనే ఉదేశ్యం తో ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. లబ్ధిదారులు పది లక్షల రూపాయలు తీసుకొని వ్యాపారా న్నిఅభివృద్ధి పదంలో కి తీసుకొని వెళ్లాలని చెప్పారు. వ్యాపారం పై వచ్చే లాభాన్ని మాత్రమే అవసరాలకోసం ఉపయోగించుకోవాలని అన్నారు. అంటరాని…
Category: Hyderabad-Photo Gallery
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశా వర్కర్ లు అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు.
బుధవారం మారేడ్ పల్లి లోని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి ఆశా వర్కర్ లకు స్మార్ట్ ఫోన్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు లో స్మార్ట్ ఫోన్ లు ఆశా వర్కర్ లకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్స్…
రాజధాని హైదరాబాద్ నగరం జనాభా పెరుగుదల, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా అన్ని రకాల మౌళిక సదుపాయాలను ఒనగూర్చుకుంటుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు
శనివారం ఉదయం పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పైన లక్ష్మీనగర్ వద్ద సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) నిర్మించిన డౌన్ ర్యాంప్ ను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణిదేవి, ఎం.ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దీన్, డిప్యూటీ మేయర్ ఎం.శ్రీలత శోభన్రెడ్డి, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి…
నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (SNDP) తో వరద ముంపు నుండి శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడిక్ మెట్ లో 12 కోట్ల రూపాయల వ్యయంతో SNDP కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, స్థానిక MLA ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుండి వచ్చే వరదనీటి తో పరిసర కాలనీలు ముంపుకు…
జీవితాలను కబళించే మహమ్మారి డ్రగ్స్ కు యువత, విద్యార్ధులు బానిసలు కావద్దు.. జీవితాన్ని అంధకారమయం చేసుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బాలం రాయ్ లో గల క్లాసిక్ గార్డెన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో కంటోన్మెంట్ MLA సాయన్న, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నార్త్ జోన్ డిసిపి చందనా దీప్తి, సినిమా డైరెక్టర్ కొరటాల శివ, సీనియర్ నటులు శ్రీనివాస్ రెడ్డి, సినీ రచయితా తనికెళ్ళ…
పురుషులు చేసే వ్యాపారాలలో స్ర్రీ లకు భాగస్వామ్యం ఉంటె అవి తప్పక విజయవంతం అవుతామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు.
బుధవారం అంబర్పేట్ లోని ఎస్.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన అంబర్ పెట్ నియోజక వర్గ దళిత బందు అవగాహన సదస్సు లో మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు దళితులందరి సంక్షేమం కోసం ఈ పధకం తీసుకువచారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పైలెట్ పథకంగా 100 మందిని ఎంపిక చేసి దీనిని అమలుపరచడం జరుగుతుందని అన్నారు. దళితులలో కొంత మందికే భూములున్నాయని లేనివారిని దృష్టిలో పెట్టుకొని వారి కొరకు ఈ పధకం…
వచ్చే ఏడాది పిబ్రవరి నాటికి SR నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
మంగళవారం అమీర్ పేట డివిజన్ లోని SR నగర్ లో 12 కోట్ల రూపాయల వ్యయంతో హోసింగ్ బోర్డ్ స్థలంలో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణం నమూనా ను మంత్రికి అధికారులు ఫోటో ద్వారా వివరించారు. పనులు చేపట్టిన ప్రాంతంలో విద్యుత్ స్తంభాలను తరలించాలని, సేవరేజ్ పైప్ లైన్ తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు మంత్రికి విన్నవించారు. తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్, వాటర్ వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ…
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పధకం ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకోని పోవాలనే ఉద్దేశ్యం తో ముందుకు వెళ్లడం జరుగుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు.
సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ తో కలిసి దళిత బంధు పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్స్ తో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి వారి వృతికి సంబందించిన వ్యాపారాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఒక్కొక్క నియోజక వర్గంలో 100 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన లబ్దిదారులకు మాత్రమే ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం…
213 లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ద్రుష్టి లోపం గలవారు నిరాశ చెందకుండా తమదైన రంగాన్ని ఎంచుకొని వివిధ రంగాలలో ముందుండాలని మహిళా శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి దివ్య దేవరాజన్ అన్నారు.
సోమవారం గవర్నమెంట్ హోమ్ ఫర్ విజువల్లీ ఛాలెంజెడ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ తపోవన్ కాలనీ లింగోజిగూడ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, దివ్య దేవరాజన్ బ్రెయిలీ చిత్రపటానికి పులా మాలలు వేశారు. దివ్య దేవరాజన్ మాట్లాడుతూ కరోనా వలన జనవరి 4 న జరపవలసిన లూయిస్ బెయిలీ జయంతిని ఈ రోజు జరుపుకుంటున్నామన్నారు. అంధుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ అని, అంధుల కొరకు లిపిని కనిపెట్టి దివ్యంగుల…
ప్రయివేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యతో పాటు సమగ్రమైన అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలు అందించుటకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మన బస్తి – మన బడి అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన బస్తి – మన బడి అనే కార్యక్రమం లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 499 , ప్రాథమికోన్నత పాఠశాలలు 9 , ఉన్నత పాఠశాలలు 182 మొత్తం 690 ప్రభుత్వ పాఠశాలలు కలవు. ఇందులో మొదటి విడతలో 239 పాఠశాలలను గుర్తించడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్ లో వసతి సదుపాయాలైన కరంట్, తాగు నీరు, ఫర్నిచర్, మరుగు…