ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఓటర్ దరఖాస్తులను ఎలక్షన్ కమీషన్ మార్గదర్శకాలకు లోబడి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై…
Category: Jogulamba Gadwal
ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా జాబితా ను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు భారతీ లక్పతి నాయక్ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాల్లో ఓటరు జాబితా తయారీ ఫారం 6, 7, 8 పెండింగ్ దరఖాస్తుల పరిశీలన తదితర వాటిపై తాసిల్దారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28 లోపు ఎలాంటి తప్పులు లేకుండా తుదిఓటరు జాబితా ను రూపొందించాలని తెలిపారు. ఫార్మ్ 6, 7, 8 కు సంబంధించి పెండింగ్…
కేంద్ర. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన వారందరికీ కొత్తగా ఓటు హక్కు నమోదును వారి విద్యా అర్హతల దృవ పత్రాల ఆధారంగా నమోదు చేయాలని అలాగే కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి పెళ్లిళ్లు అయిన మహిళలకు ఓటు హక్కు నమోదు చేసుకునే సమయంలో వారి నుండి డిక్లరేషన్ తీసుకోవాలని స్పెషల్ సమ్మరి రివిజన్ ఎలక్ట రోల్ అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి భారతి లక్పతి నాయక్ తహసిల్దారును. సూపర్వైజర్ లను. బిఎల్ఓ లను ఆదేశించారు.
సోమవారం,ఇటిక్యాల మండల పరిధిలోని కొండేరు గ్రామంలో గల 7,8,9 పోలింగ్కేంద్రాలను తనికి చేసి ఇప్పటివరకు కొత్తగా ఓటర్ నమోదు. చనిపోయిన వారిని తొలగింపులు. సవరణలో భాగంగా మార్పులు చేర్పులు చేపట్టిన కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ స్టేషన్ ల వారిగా ఇప్పటివరకు ఫారం 6 ద్వారా కొత్తగా ఓటర్ నమోదు, 7 ద్వారా చనిపోయిన వారిని ఓట్ల తొలగింపు. 8 ద్వారా పేరు అడ్రస్సు. ఇంటి పేరు వంటి మార్పులు చేసుకునేందుకు ఎన్ని…
ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గద్వాల్ జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) అపూర్వ చౌహాన్ అధికారులకు ఆదేశించారు.
సోమవారం నూతన ఐ డి ఓ సి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదుల ను స్వీకరించారు. ధరణి సమస్యలపై, వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ల పై మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయని. ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల లో ఆసరా పెన్షన్ కు సంబంధించి 14 ధరఖాస్తులు , భూ సమస్యలు , ఇతర సమస్యల కు సంబంధించి 70 ధరఖాస్తులు…
ప్రజలు మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సృజనతో కలిసి (డ్రగ్స్) మత్తు పదార్థాల నిర్మూలన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో గంజాయి హెరాయిన్ తదితర మత్తు పదార్థాలను గుర్తించి జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు నిర్వహిస్తే అట్టి విషయాన్ని ఎక్సైజ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులుకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. మత్తు పదార్థాలను ప్రజలు వినియోగించకుండా గ్రామాలలో కళాజాత బృందాలచే ప్రజలకు అవగాహన…
చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని చేనేత కార్మికుల సమస్యలపై మాస్టర్ వీవర్ లు,చేనేత కార్మిక సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముద్ర రుణాలు, వాటి సబ్సిడీపై వివరించారు. చేనేత మిత్ర అకౌంటు కు చేనేత కార్మికుల ఈ కేవైసీ ని అనుసంధానం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చేనేత కార్మికుల పెన్షన్, స్కిల్ డెవలప్మెంట్, సమర్ధ ట్రైనింగ్, లోన్ వివర్ డీటెయిల్స్ గురించి చర్చించడం జరిగింది.…
రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పిఎసిఎస్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ధరూరు మండలంలో ఉన్నటువంటి పిఎసిఎస్ అంటే సింగల్ విండో ద్వారా యూరియా యొక్క సప్లై గురించి వాకప్ చేశారు. అయితే యూరియా అక్కడ గ్రౌండ్ స్టాకు455 బస్తాలు కాగా ఇ పాస్ మిషన్ స్టాకు 455 బస్తాలు ఉన్నట్టుగా పరిశీలించారు. ఆ పిమ్మట అక్కడ ఉన్నటువంటి ఎక్సక్యూటివ్ ఆఫీసర్ రాజు తో మాట్లాడుతూ యూరియా ని ఎమ్మార్పీ ధర కు అమ్ముకుంటూ లింకు లేకుండా రైతులకు కావాల్సినంత యూరియా…
రైతు రుణమాఫీ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాంకర్లను ఆదేశించారు.
శుక్రవారం ధరూర్ లోని ఏపీజీవీబీ బ్యాంకు సందర్శించి రైతు రుణమాఫీ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు పరిధిలో 1388 మందికి రుణమాఫీ వర్తించగా వారికి రుణమాఫీ అయిందా లేదా కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు రుణమాఫీకి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి రైతులు రుణమాఫీకి వస్తే వారికి మాఫీ అయిందా లేదా వివరాలు తెలియజేయాలన్నారు. కొత్తగా రుణం పొందాలనుకుంటే రైతులకు రుణం అందజేయాలన్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాలలో సభలు ఏర్పాటు చేసి రైతు…
జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధనపు కలెక్టర్ రెవిన్యూ చీర్ల శ్రీనివాస్ అన్నారు.
గురువారం జిల్లా ఐ డి ఓ సి సమావేశం హాలు నందు గద్వాల్ నియోజకవర్గo 79 తహసిల్దార్లు , సెక్టార్ అధికారులు, సర్వేయర్లు లతో శాసనసభ ఎన్నికలకు జిల్లాలో చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధనపు కలెక్టర్ రెవిన్యూ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో 593 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గద్వాల్ నియోజకవర్గo లో పూర్తిస్థాయి ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు…
ఓటరు అవగాహన కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలని జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ అన్నారు.
ఓటర్ అవగాహన కార్యక్రమంలో స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీధి నాటకం, పోయెమ్ ,థీమ్స్ పాటలు తదితర అంశాలను ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు అదనపు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఎం ఏ ఎల్ డి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ పాఠశాల గట్టు రూ.10వేలు, రెండవ బహుమతి టీఎస్ ఆర్ జె సి బాయ్స్ పాఠశాల బీచుపల్లి రూ.8వేలు, మూడవ బహుమతి ప్రభుత్వ జూనియర్ కళాశాల ధరూర్ రూ.5…