Category: Mancherial-Photo Gallery

జిల్లాలో ఆధార్‌ నవీకరణ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆధార్‌ నవీకరణ ప్రక్రియపై ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు, రెవెన్యూ, విద్య, పంచాయతీ, సంక్షేమ శాఖల అధికారులు, యు.ఐ.డి.ఎ.ఐ. అసిస్టెంట్‌ మేనేజర్‌, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆధార్‌ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు తమ…

పండుగలను ప్రజలందరు కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఈ నెల 23న ప్రారంభం కానున్న రంజాన్‌ మాసం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ పి.గౌతమితో కలిసి పోలీసు శాఖ అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కమీషనరు, విద్యుత్‌, కమర్షియల్‌ టాక్స్‌, నీటి పారుదల శాఖల అధికారులు, మసీదు కమిటీ పెద్దలు, మైనార్టీ…

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో ట్రైనీ కలెక్టర్‌ పి.గౌతమితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామానికి చెందిన దొడ్డ శిరీష తాను బి.కాం. చదువుకొని కంప్యూటర్‌లో పి.జి.డి.సి.ఎ., టాలీ పూర్తి చేశానని, తనకు కంప్యూటర్‌ వర్క్‌ సంబంధించి ఉద్యోగం కల్పించి…

బ్యాంకర్లకు కేటాయించిన నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్‌ పి.గౌతమి, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ అధికారి మహిపాల్‌రెడ్డితో కలిసి బ్యాంకుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా ఆర్థిక రుణ ప్రణాళికలో…

అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తిని సి.పి.ఆర్‌. విధానం ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల వైద్య కళాశాలలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సి.పి.ఆర్‌.-ఎ.ఈ.డి.పై ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య కళాశాల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని టైనీ కలెక్టర్‌ పి.గౌతమి, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా! బి.సి. సుబ్బారాయుడుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ…

మహిళల అభివృద్ధి, రక్షణ కొరకు ప్రభుత్వం అహర్నిశలు (శమిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని నెన్నాల మండల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, డి.సి.సి.బి. చైర్మన్‌ భోజారెడ్డి, డి.సి.ఎం.ఎస్‌. అధ్యక్షులు లింగయ్యతో కలిసి తునికాకు, వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా లబ్టిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా…

ప్రజా సేవలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలో గల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సి.పి.ఆర్‌. శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ గుండెపోటుకు…

ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రేశేఖర్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్క సుమన్‌, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, వైద్య విద్య విధాన పరిషత్‌…

చెన్నూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి శాసనమండలి సభ్యులు దేశ్‌పతి శ్రీనివాస్‌, బెల్లంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి…

ప్రజల కంటి సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలలో 100 శాతం లక్ష్యాలను సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. మంగళవారం జిల్లాలోని జైపూర్‌ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మిక తనిఖీ చేసి శిబిరం పనితీరు, రిజిస్టర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌…