రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సంచాలకులు దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ మౌళిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు – మన బడి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
Category: Mancherial-What’s Happening
MNCL : పురపాలక సంఘాల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ప్రజల సౌకర్యార్థం ప్రతి పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కూరగాయల, మాంసపు మార్కెట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్తో కలిసి మున్సిపల్ కమీషనర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి…
MNCL : జిల్లా అభివృద్ధికి అందరు సమన్వయంతో పని చేయాలి : జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ
అధికార యంత్రాంగం, (ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్తో కలిసి హాజరయ్యారు. 13వ జాతీయ ఓటరు దినోత్సవం…
MNCL : మన రేపటి భవిష్యత్తు కోసం సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశమే “ఓటు హక్కు” : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మన రేపటి భవిష్యత్తు కోసం సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశమే “ఓటు హక్కు” అని, అర్హత గల ప్రతి ఒక్కరు ఎన్నికలలో తమ ఓటు హక్షు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం 18వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వేణుతో కలిసి హాజరై అందరితో జాతీయ ఓటరు…
MNCL : కంటి వెలుగు శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి కంటి…
MNCL : అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్
ఓటు హక్కు సక్రమంగా వినియోగించడం ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకొని దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించవచ్చని, అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా, పారదర్శకంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో జాతీయ ఓటరు దినోత్సవం, పి.ఎస్.ఈ. ఎంట్రీ ధృవీకరణ, ఓటర్…
MNCL : కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
అంధత్వ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు, ప్రజల కంటి సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మండల పరిధిలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి ప్రారంభించిన అనంతరం చెన్నూర్ పట్టణంలోని (బాహ్మణవాడ, భీమారం మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి…
MNCL : కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ప్రణాళికబద్దంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
కంటి వెలుగు 2వ విడత కార్యక్రమ నిర్వహణ కొరకు రూపొందించిన కార్యచరణ ప్రకారంగా ప్రణాళికబద్దంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి.సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, కంటి వెలుగు వైద్యులు, మండల పంచాయతీ అధికారులు, ప్రత్యేక అధికారులతో కంటి వెలుగు సన్నాహక ఏర్పాట్లపై టెలీ…
MNCL : కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డి.జి.పి. అంనికుమార్, వైద్య-ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కమీషనర్ శ్వేతా మహంతితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు,…
MNCL : నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎవరైనా విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగా…