మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్మ ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్దం లక్ష్మి, కటారి రేవతి లతో కలిసి జిల్లాలో మహిళల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలును జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఋణాలు, స్త్రీ నిధి ఋణాలు లక్ష్యాలకు…
Category: Yadadri Bhuvanagiri-Press Releases
Press Note 24-05-2022 రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన హక్కులను కాపాడటం మహిళా కమిషన్ బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
మంగళవారం నాడు జిల్లా కలెక్టరు కార్యాలయం మీటింగ్ హాలులో వివిధ మహిళా సంఘాలు, ఆశా, ఎఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయితీ సెక్రటరీలతో మహిళా హక్కులు, సాధికారతపై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు. జిల్లా, కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు శ్రీమతి షహీన్ అఫ్రోజ్, శ్రీమతి కుమ్మ ఈశ్వరీబాయి, శ్రీమతి కొమ్ము ఉమాదేవి, శ్రీమతి గద్దల పద్మ, శ్రీమతి…
Press note. 21.5.2022. వచ్చే వానకాలం ఖరీఫ్ సీజన్ లో రైతు వేదికలలో వ్యవసాయ సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు పొందేలా సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి వ్యవసాయ అధికారులకు సూచించారు.
శనివారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హలులో వ్యవసాయం ఏ.డి.లు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వచ్చే వానాకాలం ఖరీఫ్ పంటల సాగుపై తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతు వేదికలలో వ్యవసాయ సాగు పద్ధతులు, నూతన సాంకేతిక విధానాలపై ప్రతి మంగళవారం శుక్రవారం తప్పనిసరిగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు…
Press note. 21.5.2022. సాధారణ ప్రసవాలు చేయించుకోవాలని, సిజేరియన్ ఆపరేషన్ల వలన తల్లీ బిడ్డలకు నష్టాలు కలుగుతాయని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి సూచించారు.
శనివారం నాడు జిల్లా కలెక్టర్ బొమ్మలరామారం మండలం లక్ష్మీ తండ గ్రామపంచాయతీలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ గ్రామంలో స్త్రీలు రక్త హీనత కలిగి ఉండటం, వీరు ప్రసవానికి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడం జరుగుచున్నందున వీరు ఆడపిల్లలను కనుటకు ఇష్ట పడకపోగా, ఎవరికీ తెలియకుండా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అబార్షన్ చేయించుకోవడం జరుగుతున్నందున, వివాహాలలో కూడా బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నందున అక్కడి ప్రజలకు, మహిళలకు…
Press note. 20.5.2022. వచ్చే 15 రోజుల లోపు దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అసెంబ్లీ స్పెషల్ ఆఫీసర్లను, మండల స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు.
శుక్రవారంనాడు కాన్ఫరెన్స్ హాలులో మండల వారీగా దళిత బంధు పథకాన్ని ఆమె సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.హెచ్.కృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాన్యా నాయక్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి శ్రీమతి పరిమళా దేవి, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీమతి అన్నపూర్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి నర్సింహా, జిల్లా…
Press Note 20-05-2022 ఆరోగ్య తెలంగాణ సాధనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి టి. హరీశ్ రావు అన్నారు.
శుక్రవారం నాడు భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో 46 లక్షలతో ఏర్పాటు చేసిన 30 పడకల డెడికేటెడ్ పీడియాట్రిక్ సెంటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాన్ని, 20 పడకల ఎస్.ఎన్.సి.యు. బేబే కేర్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. తదుపరి ఒక కోటి 25 లక్షలతో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్, రేడియాలజీ విభాగం భవనానికి, 74 లక్షల 50 వేల రూపాయలతో ఆసుపత్రి మరమ్మత్తులు, ఆధునీకరణ, విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,…
Press Note 19-05-2022 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి ఋణాలకు సంబంధించి 92 శాతం ప్రగతి సాధించినట్లు జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు.
గురువారం నాడు తన ఛాంబర్లో స్త్రీ నిధి యాప్ ను జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2021-22 సంవత్సరంలో స్త్రీ నిధి ఋణాల క్రింద 105 కోట్ల 85 లక్షలకు గాను 98 కోట్ల 10 లక్షల 47 వేల రూపాయలు అందించి 92 శాతం ప్రగతి సాధించామని తెలిపారు. దీనిలో డైరీ ఋణాలు 143 యూనిట్లకు గాను ఒక కోటి 33 లక్షల 36 వేల రూపాయలు లబ్దిదారులకు ఇవ్వడం జరిగిందని…
Press Note 19-5-2022 గ్రామీణ క్రీడా ప్ర్రాంగణాలు, బృహత్ పల్లెప్రకృతి వనాలకు అనువైన స్థలాల సేకరణ రెండు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి రెవిన్యూ, పంచాయితీ అధికారులను ఆదేశించారు.
గురువారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాలులో తహశీలుదార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయితీ అధికారులు, ఉపాధి హామీ అధికారులతో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లెప్రకృతి వనాలకు స్థలాల ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు అనువుగా ఎకరం, లేదా ఎకరన్నర స్థల సేకరణ చేపట్టాలని, అలాగే మండలానికి 5 చొప్పున 85 బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటులో భాగంగా ఇప్పటి వరకు 30 స్థలాల సేకరణ పూర్తి అయ్యిందని,…
బుట్టలు అల్లడంలో శిక్షణ పొందిన పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీమతి జె.విజయ, భర్త గంగాధర్ కు రాష్ట్ర మేదర ఫెడరేషన్ ద్వారా మేదర బుట్టలు, అల్లికలకు సంబంధించిన పరికరముల కొనుగోలుకు మంజూరు చేయబడిన 50 వేల రూపాయల చెక్కును గురువారం నాడు జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి తన కార్యాలయంలో అందచేశారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య ఉన్నారు.
PRESS NOTE 19-05-2022 రేపు 20 వ తేదీ శుక్రవారం నాడు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్ రావు జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి నేడొక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్ని సందర్శిస్తారని, ఉదయం 11.40 గంటలకు భువనగిరి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీ డయాగ్నస్టిక్ సెంటర్ పనులకు శంకుస్థాపన, 32 పడకల డి.పి.సి.యు., 20 పడకల ఎస్.ఎన్.సి.యు. కేంద్రాలకు ప్ర్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12.15 గంటలకు స్థానిక విద్యానగర్ నందు కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్ వైద్యులు, డ్రగ్…