ప్రతి ఓటరు ఒక చోట మాత్రమే తమ ఓటు హక్కును కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు జాబితా పై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒక ఓటరుకు ఒక చోట మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండాలని, ఇతర చోట్ల ఉన్నట్లయితే క్షేత్ర పరిశీలన అనంతరం తొలగించడం జరుగుతుందని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకే ఫొటోతో ఇతర పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు కలిగి ఉన్న 17,809 మంది, అలాగే బోథ్ నియోజక వర్గంలో 5712 మంది ఉన్నారని తెలిపారు. బూత్ స్థాయి అధికారుల ద్వారా పోలింగ్ కేంద్రాల వారిగా క్షేత్ర పరిశీలన చేసి ఓటరు నివాస ప్రాంతంలోనే ఓటుహక్కు కల్పిస్తామని, ఇతర చోట్ల ఉన్నట్లయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక సాఫ్ట్ వెర్ ద్వారా తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించి సమగ్ర ఓటరు జాబితా తయారీకి సహాయసహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్లు సాయి మహేష్, శ్రీవాణి, అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- ఓటరు ఒక చోట మాత్రమే తమ ఓటు హక్కును కలిగి ఉండాలి- అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్.
You might also like:
-
DPRO ADB- పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.