DPRO KMNR తేది :15-09-2021 : వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నరాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు . (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన

తేదీ: 15-09-2021
కరీంనగర్

వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలి

గ్రామాలలో ఇంటింటి సర్వే చేసి వ్యాక్సినేషన్ అయినట్లు స్టికర్ అంటించాలి

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు
-000-

రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి అందరూ జిల్లా కలెక్టర్లతో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమం పై వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలో ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేసెందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు.

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉందని, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలోని వార్డుల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం పై సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు. గ్రామీణ ప్రాంతాలో సైతం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టాలని, దీని కోసం ప్రతి ప్రాథమిక ఆరొగ్య కేంద్రం పరిధిలో ఉన్న సబ్ సెంటర్, వాటి పరిధిలో ఉన్న గ్రామాలో వ్యాక్సిన్ చేయుటకు ప్రణాళికలు రుపొందించాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో అవసరమైన మేర వ్యాక్సిన్ అందుబాటులొ ఉన్నందున పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. గ్రామాలో ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ అందించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే చేసి ఇండ్లలలో వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు డోర్లకు స్టికర్ లను అంటించాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ స్థాయి అధికారులు చురుగ్గా పాల్గొనాలని అన్నారు. కోవిడ్ నివారణ టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మొదటి కోటి డోసుల వ్యాక్సినేషన్ కు 178 రోజుల సమయం పట్టిందని, రెండవ కోటి వ్యాక్సిన్ డోసులు 71 రోజులలో పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో మూడో కోటి వ్యాక్సినేషన్ డోసులను 20 రోజులోపు అందించి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతుందని సీఎస్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 58 శాతం పూర్తి చేశామని తెలిపారు. రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ 42 శాతం పూర్తి అయినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మిగిలిన వారికి రెండు వారాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గురువారం నుండి గ్రామాల వారీగా, వార్డుల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయుటకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, వార్డు మెంబర్ల సహకారం తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.

అనంతరం రాష్ట్రంలో ఇంత వరకు 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనర్ గరీమా అగర్వాల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రియాంక, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారిని డా.జువేరియా, జిల్లా పంచాయితీ అధికారి వీర బుచ్చయ్య, తదితరులు పాల్గోన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ గారిచే జారీ చేయడమైనది.

Share This Post