సిఎంఆర్ లక్ష్యం సకాలంలో పూర్తి చేయాలి
– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు
ఎఫ్సిఐ నింబధనలను పాటిస్తూ జిల్లాలోని మిల్లర్లుకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఎఫ్సిఐ అధికారులు, మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎంఆర్ ఆలస్యానికి గల కారణాలను మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గోడౌన్ల కొరత, టాన్స్పోర్టు సమస్యల వలన సిఎంఆర్ ఆలస్యం అవుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు సిఎంఆర్ లక్షా్యలను సకాలంలో సాధించలేక పోతున్నారని, కొంతమంది మిల్లర్లు వలన మిగతావారు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మిల్లర్లు సీఎంఆర్ నిబంధనలు పాటిస్తూ సకాలంలో బియ్యం అందించాలన్నారు. జిల్లాలో వరి ధాన్యం అధికంగా ఉన్నందున బియ్యం కొరకు ప్రత్యేక గోడౌన్ ఏర్పాటు చేసి దిగుమతి ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎఫ్సిఐ అధికారులకు సూచించారు. మిల్లర్లు, ఎఫ్సిఐ అధికారులు సమన్వయంతో పనిచేసి సిఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ యస్ మోహన్రావు, ఎఫ్సిఐ డివిజనల్ మేనేజర్ వరుణ్ సుద్, మేనేజర్ వాగ్యనాయక్, డిఎం సివిల్ సప్లయ్ రాంపతి, సూర్యాపేట రైస్ మిల్లుల అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు