Press Release
Please Cover
For Print & Electronic Media
తేది.11/06/2021, హైదరాబాద్.
*నకిలీ విత్తనాలను అరికట్టేందుకు హాకా భవన్ లో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఐజీ నాగిరెడ్డి గారు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు , వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బాలు, శివప్రసాద్ గార్లు*
నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం
– దొరికితే పీడీ యాక్ట్ నమోదు తప్పదు
– 1966 లో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ విత్తన విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయి
– విత్తన చట్టాల బలోపేతానికి కేంద్రానికి లేఖ రాస్తాం
– వ్యవసాయరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రాధాన్యం .. నకిలీ విత్తనాలను ఉపేక్షించే పరిస్థితి లేదు
– దేశంలో నకిలీ విత్తన తయారీ దారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
– ప్రధానంగా పత్తి, మిరప నకిలీ విత్తనాలపై ప్రధాన దృష్టి
– ఇప్పటికే ఈ సీజన్ లో 177 కేసులు నమోదు చేసి 276 మందిని అరెస్టు చేయడం జరిగింది
– 3468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది
– విత్తనాల లైసెన్సింగ్ విధానం పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
– విత్తన లైసెన్సుల జారీకి కాలపరిమితిని నిర్దేశించి నిర్ణీత సమయంలో ఇవ్వాలి
– నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రేపు క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
– నకిలీ విత్తనాలను అరికట్టేందుకు హాకా భవన్ లో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఐజీ నాగిరెడ్డి గారు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు , వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బాలు, శివప్రసాద్ గార్లు