Hon’ble Minister for Agriculture released Pulses Report.

Press Release
Please Cover

For Print & Electronic Media
తేది.24/06/2021, హైదరాబాద్

*FEDERATION OF Telangana Chambers Of India ( FTCCI) నివేదికలోని సూచనలను అమలుకు తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, FTCCI పరిశోధనా బృందం డిప్యూటీ సీఈఓ సుజాత ఆధ్వర్యంలో రూపొందించిన పల్సెస్ (pulses Opportunities & Way Forward)పై రూపొందించిన నివేదికను సాయంత్రం హాకా భవన్ లో విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన అధ్యక్షులు రమాకాంత్ ఇనాని, సీఈఓ క్యాతి నరవనే తదితరులు*

పప్పు దినుసుల వినియోగం, ఉత్పత్తి, దిగుమతిలో అగ్రస్థానం మనదే

– దేశంలో అత్యధిక జనాభా పప్పుదినుసులు వినియోగిస్తున్నారు .. అందుకే ఎక్కువగా వినియోగిస్తున్నాం

– దేశంలో ఆహార భద్రత సాధించాం .. కానీ పోషక భద్రతను పూర్తిస్థాయిలో కల్పించలేకపోతున్నాం

– పప్పుదినుసుల ఉత్పత్తి విషయంలో ఆయా దేశాల్లో పండే విస్తీర్ణం, ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది .. మిగతా దేశాలు దానిని సాధించగలిగాయి

– మన దేశంలో పండే పంటల విస్తీర్ణంలో 34 శాతం పప్పు దినుసులు సాగుచేస్తున్నా కూడా ఉత్పాదకత సాధించలేకపోతున్నాం .. అందుకే మొత్తం జనాభాకు సరిపడే మోతాదులో పప్పుధాన్యాలు పండించలేక పోతున్నాం

– 2010 – 2017 మధ్యకాలంలో దేశంలో పప్పు దినుసుల దిగుబడి హెక్టారుకు 649 కిలోలు మాత్రమే ఉంది

– 2017 తర్వాత కేంద్రప్రభుత్వం మన సాగు గణనీయంగా  పెంచాలని భావించినా  దేశంలో వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర దేశాల దిగుమతుల మీదనే  ఆధారపడాల్సి వస్తుంది

– దేశంలో ఇక్రిషాట్ చేసిన ఒక పరిశోధనలో మాంసపుకృత్తుల కోసం ఎక్కువమంది ప్రజలు పప్పుదినుసుల మీదనే ఆధారపడుతున్నారని తేలింది

– దేశంలో గానీ, తెలంగాణలో గానీ పప్పుదినుసుల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది

– దానిని గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత కొన్నేళ్లుగా పంటమార్పిడిలో భాగంగా పప్పుదినుసుల సాగును ప్రోత్సహిస్తున్నారు

– దానిలో ప్రధానంగా కంది పంటను గతంలో 6 లక్షల ఎకరాల నుండి గత ఏడాది 10.80 లక్షల ఎకరాలకు, ఈ ఏడాది 20 లక్షల ఎకరాలలో సాగును ప్రోత్సహిస్తున్నారు

– దాంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో దాల్ మిల్లుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తాం

– FEDERATION OF Telangana Chambers Of India ( FTCCI) నివేదికలోని సూచనలను అమలుకు తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, FTCCI పరిశోధనా బృందం డిప్యూటీ సీఈఓ సుజాత ఆధ్వర్యంలో రూపొందించిన పల్సెస్ (pulses Opportunities & Way Forward)పై రూపొందించిన నివేదికను సాయంత్రం హాకా భవన్ లో విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన అధ్యక్షులు రమాకాంత్ ఇనాని, సీఈఓ క్యాతి నరవనే తదితరులు

 

 

Share This Post