MNCL : మహిళల సంక్షేమం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలు : రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు, సంబంధిత శాఖల అధికారులతో ఆరోగ్య మహిళ, సి.పి.ఆర్‌. శిక్షణ, కంటి వెలుగు, వడ్డీ లేని రుణాలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మాట్లాడుతూ మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు 100 ఆరోగ్య మహిళ కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య మహిళ క్రింద ప్రతి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, బస్తి దవాఖానాలో మహిళల కోసం ప్రత్యేక క్లినిక్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని, 8 ప్యాకేజీలలో 57 రకాల పరీక్షలను చేయడం జరుగుతుందని, ప్రాథమిక డయాగ్గొస్టిక్‌, క్యాన్సర్‌ స్కీనింగ్‌, వెయిట్‌ మేనేజ్‌మెంట్‌, మైక్రో న్యూట్రిషన్‌ డెఫిషియన్సీ, సెక్సువల్‌ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్ఫెక్షన్‌, పి.సి.ఓ.డి., రుతుస్రావ సమస్యలు, ఇన్‌ఫెర్టిలిటి, మెనోపాజ్‌ మేనేజ్మెంట్‌, ఐ.వి. తదితర అంశాలు పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాలలో తెలంగాణ డయాగ్నొస్టిక్‌ అందుబాటులో ఉన్నాయని, ఏప్రిల్‌ చివరి నాటికి మరో 7 జిల్లాలో ఏర్పాటవుతాయని అప్పటి వరకు సమీప జిల్లాకు అనుసంధానం చేయడం జరిగిందని, నమూనా ఇతర జిల్లా కేంద్రాలకు తరలించేందుకు అదనపు వాహనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మహిళలలో ఉన్న పోషకాల లోపం నివారణ కోసం క్లినిక్‌లో డి3, బి12తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తామని, బరువు సంబంధించిన అంశంలో న్యూట్రిషన్‌ సూచించి, అవసరమైన యోగ, వ్యాయమాలకు సంబంధించిన వీడియో అందజేయడం జరుగుతుందని తెలిఆరు. మహిళా క్లినిక్‌లో క్యాన్సర్‌ స్కీనింగ్‌ జరుగుతుందని, అనుమానితులకు, లక్షణాలు ఉన్న వారికి జిల్లా స్థాయిలో మామోగ్రామ్‌, బయాప్సి, పాప్స్‌ మీర్‌, కోల్పోస్మోపి పరిక్షలు నిర్వహించి, క్యాన్సర్‌ నిర్ధారణ జరిగితే నిమ్స్‌ ఎం.ఎన్‌.జె.లో చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళా క్లినిక్‌కు వచ్చే పేషెంట్ల వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేయడం జరుగుతుందని, వీటిని రిఫరల్‌ ఆసుపత్రికి అనుసంధానం చేయడం జరుగుతుందని, జిల్లా ఆసుపత్రిలో ఇబ్బందులు కలుగకుండా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు.

జిల్లాలో త్వరితగతిన సబ్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులు, ఇతర మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని. మహిళా దినోత్సవం రోజున 2 సంవత్సరాల పెండింగ్‌ వడ్డి లేని రుణం బకాయిలు 650 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయి వేడుకలలో గ్రామీణ సంఘాలకు, మెప్మా సంఘాలకు సంబంధిత చెక్‌లు అందించాలని తెలిపారు.

ఇటీవల కాలంలో రాజేంద్రనగర్‌లో ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ సి.పి.ఆర్‌. నిర్వహించడం వల్ల రాజశేఖర్‌ అనే వ్యక్తి
ప్రాణాలు కాపాడటం జరిగిందని, కరోనా తరువాత కారణాలు తెలియకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఆకస్మికంగా గుండె పోటుకు గురవుతున్నారని, ఆదిలాబాద్‌ జిల్లాలో 19 సంవత్సరాల యువకుడు పెళ్లి వేడుకలో మరణించారని, సి.పి.ఆర్‌. చేయడం వల్ల ఆకస్మికంగా గుండెపోటు వచ్చే వారిలో సి.పి.ఆర్‌. ద్వారా 50 శాతం మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి సి.పి.ఆర్‌. శిక్షణ అందించాలని, ఆరోగ్య కార్యకర్తలు, స్వశక్తి మహిళా సంఘాలు, ఆర్‌.టి.సి., పోలిస్‌ సిబ్బంది, షాపింగ్‌ మాల్స్‌, అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, వివిధ వర్ణాల ప్రజలకు శిక్షణ అందించడం జరుగుతుందని, ప్రతి జిల్లాలో మార్చి 18 నుంచి సి.పి.ఆర్‌. శిక్షణ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, స్థానిక మంత్రులు, శాసనసభ్యులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. జిల్లాలో సి.పి.ఆర్‌. శిక్షణ అందించేందుకు ప్రతి జిల్లాకు 5 నుంచి 7 మాస్టర్‌ (టైయినర్లను అందుబాటులో ఉంచి ప్రతి రోజు కనీసం 300 మందికి శిక్షణ అందించేలా అధికారులు పర్యవేక్షించాలని, జిల్లా, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1 వేయి 200 ఆరోగ్య కేంద్రాలలో ఏ. ఈ.డి. యంత్రాలను 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రజల కంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 63.82 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 11.42 లక్షల మందికి రీడింగ్‌ కళ్ళద్దాల పంపిణీతో పాటు అవసరం ఉన్న 8.02 లక్షల మందికి ప్రిస్మిష్షన్‌ కళ్ళద్దాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో ప్రిస్కిప్షన్‌ కంటి అద్దాల పంపిణీలో కలెక్టర్లు ప్రతి రోజు పర్యవేక్షించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 40 కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రతి శిబిరంలో రోజు దాదాపు 100 మంది వరకు పరీక్షలు నిర్వహించి మందులు, రీడింగ్‌ అద్దాలు అందించడంతో పాటు ప్రిస్కిష్ప్సన్‌ అద్దాలు అవసరం ఉన్న వారికి ఆర్జర్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి వైద్యాధికారులు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్‌ నాయక్‌, బి.రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ పి.గౌతమి, జిల్లా అటవీ అధికారి శివ్‌ ఆశిష్‌ సింగ్‌, డి.సి.పి. సుధీర్‌ ఆర్‌ కేకన్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post