ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హిత్గ్రాహి యోజనా ద్వారా నైపుణ్య శిక్షణ పొంది ఉపాధి పొందేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చని యస్.కె. శ్రీవాస్తవ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి నేడోక ప్రకటనలో తెలిపారు. యస్సిలు, ఓబీసీ,ఇబిసి, డిఎన్ టి వర్గానికి చెంది 18 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మహిళలు, పురుషులు ట్రాన్సజెండర్లు ఎవరైనా సరే PM-DAKSH అనే యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుండి తమ మొబాయిల్ లో డౌన్లోడ్ చేసుకొని లేదా pmdaksh.dosje.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్మికులు, చేతివృత్తుల వారు, నిరుద్యోగ యువతి యువకులు ఈ పథకం ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ పొంది తమ చేతివృత్తి రంగంలో మరింత నైపుణ్యం పొందాటానికి మంచి అవకాశంగా తెలిపారు. నిరుద్యోగ యువతి యువకులు తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొంది తద్వారా ఉపాధి పొందటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసారు. గృహిణులు సైతం ఇంటి నుండి ఉపాధి పొందేందుకు ఈ ఉచిత శిక్షణ తరగతులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. శిక్షణ తరగతులు కేటగిరి ని బట్టి 35 నుండి 60 గంటలు/5 నుండి 35 రోజులు ఉంటుందని తెలియజేసారు. జిల్లా ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి వెంటనె ఆన్లైన్ ద్వారా కానీ మొబాయిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
You Are Here:
Home
→ PM-DAKSH యోజన ద్వారా నైపుణ్య శిక్షణ : కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి ఎస్ కే శ్రీవాస్తవ
You might also like:
-
ఈ నెల 23వ తేదీ నుండి నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు
-
నారాయణపేట జిల్లా భూగర్భ జలవనరుల అంచన నివేదికను ఈరోజు జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆవిష్కరించారు.
-
దళిత బందు లబ్ది దారులకు యూనిట్లను త్వరితగతిన పంపిణి చేయాలి :: జిల్లా కలెక్టర్ డి హరిచందన.
-
నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న అరుణ్య ఉత్పత్తులను ఇక నుండి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు ఎం.ఓ.యూ అగ్రిమెంట్ చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర ఐ.టి. పరిశ్రమలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చేనేత జౌళి శాఖ మంత్రి కే.టి.రామారావు అన్నారు