గుండాల మండలం గుండాల పల్లె ప్రకృతి వనం, పాచిల్ల గ్రామ పంచాయతీ నర్సరీలను మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి పరిశీలించారు. వేసవి ఉన్నందున మొక్కల రక్షణ కోసం షేడ్ నెట్ పెట్టాలని, ఎప్పటికప్పుడు వాటరింగ్ చేపట్టాలని, బెడ్లలో కలుపు మొక్కలు లేకుండా చూడాలని, నర్సరీ చుట్టుపక్కలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపిడిఓ జీ.శ్రీనివాసులు, తాసీల్దార్ జ్యోతి, RI వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు రమేష్, మౌనిక, ఫీల్డ్ అసిస్టెంట్ నవనీత పాల్గొన్నారు.
……DPRO., YADADRI.