Tags: MAHABUBABAD

ఉద్యోగులందరు వ్యాక్సిన్ తీసుకోవాలి.

ప్రచురణార్ధం మహబూబాబాద్, డిసెంబర్,6. ఉద్యోగులందరు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో కోవిడ్ -19వ్యాక్సిన్ పై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో కోవిడ్ మొదటి డోస్ 94శాతం పూర్తి అయ్యిందని, అలాగే 2వ డోస్ 52 శాతం చేయడం జరిగిందన్నారు. 100 శాతం పూర్తి చేసేందుకు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసినందున ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని, కుటుంబ సభ్యులకు వేయించాలని…

గ్రీవెన్స్ దరఖాస్తులను  సత్వరమే  పరిష్కరించాలి..

ప్రచురణార్థం గ్రీవెన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.. మహబూబాబాద్, డిసెంబర్ – 06: ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ పరిష్కారం చేయుటకు కోరుతూ సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రగతి సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శి పోస్టుల నియామకంలో మెరిట్ జాబితాలో ఉన్నప్పటీకి తన కంటే మెరిట్ లో తక్కువ వారికి ఉద్యోగం కల్పించారని, తనకు ఫోన్…

ప్రభుత్వ కార్యాలయాల స్థలదాతల ను అభినందించిన కలెక్టర్

ప్రచురణార్థం ప్రభుత్వ కార్యాలయాల స్థలదాతల ను అభినందించిన కలెక్టర్. మహబూబాబాద్ డిసెంబర్ 6. జిల్లాలోని పెద్ద వంగర మండలం ప్రభుత్వ కార్యాలయాల కొరకు స్థలాన్ని ఇచ్చిన దాతలను జిల్లా కలెక్టర్ శశాంక అభినందించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మార్కెట్ ధర ప్రకారం అత్యంత విలువ చేసే స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వడం దాతల దాతృత్వానికి నిదర్శనమన్నారు. సర్వేనెంబర్ 522 లో ఒక ఎకరం 20 గుంటల భూమి పత్రాలను తాసిల్దారు చేతుల మీదుగా కలెక్టర్కు అందజేశారు.…

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి…

ప్రచురణార్థం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి… మహబూబాబాద్ డిసెంబర్ 6. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. సోమవారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు అనంతారం గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పండించే యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని తేల్చిచెప్పినందున యాసంగి ధాన్యం కు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం…

వరి పంట దిగుబడి ప్రయోగాలను పరిశీలించిన కలెక్టర్

ప్రచురణార్థం వరి పంట దిగుబడి ప్రయోగాలను పరిశీలించిన కలెక్టర్ కురవి మహబూబాబాద్, డిసెంబర్ 4. జిల్లాలోని కురవి మండలం లింగ్యా తండాలో వరి పంట దిగుబడి ప్రయోగాలను జిల్లా కలెక్టర్ శశాంక శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కురవి గ్రామపంచాయతీ పరిధిలోని లింగ్యా తండా గ్రామంలో 259/9 సర్వేనెంబర్ లో ని వరి పంట దిగుబడిని ఐదు మీటర్ల పొడవు ఐదు మీటర్ల వెడల్పు తీసుకొని అంచనా వేశారు. పంటను కోయించి తూర్పార బట్టి వేయింగ్…

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి…

ప్రచురణార్థం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి… మహబూబాబాద్ డిసెంబర్ 4. యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అధికారులతో ప్రత్యామ్నాయ పంటలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి లో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఊరూర రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన…

వసతిగృహాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలి…

ప్రచురణార్థం వసతిగృహాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలి… మహబూబాబాద్, డిసెంబర్ 3. వసతి గృహాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికలు బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వసతి గృహాలకు తప్పనిసరిగా మెస్ డోర్ లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వసతిగృహాల లోపలి…

సమన్వయంతో అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రగతి సాధించాలి…

ప్రచురణార్ధం సమన్వయంతో అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రగతి సాధించాలి… మహబూబాబాద్, 2021 డిసెంబర్ -03: అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేసినప్పుడు అనుకున్న ప్రగతిని అలవోకగా సాధించవచ్చని రాష్ట్ర షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ కమీషనర్ డాక్టర్ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి సంక్షేమ హాస్టల్స్, పోస్ట్, ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ లపై ములుగు, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో…

దివ్యంగులకు చేయూత అందిస్తాం…

ప్రచురణార్ధం దివ్యంగులకు చేయూత అందిస్తాం… మహబూబాబాద్, డిసెంబర్,3. విధి సహకరించక పోయినా ఆత్మ విశ్వాసంతో ఉన్నత విద్యనభ్యసిస్తూ ఆత్మ స్థైర్యంతో ముందడుగు వేస్తున్న దివ్యంగులకు చేయూత అందిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం ఐ.ఎం.ఏ.హాలులో జిల్లా మహిళ శిశు సంక్షేమం, దివ్యంగుల సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీ పురస్కరించుకుని ప్రపంచ దివ్యంగుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కలెక్టర్ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య…

మిల్లర్లు సహకరించాలి…

ప్రచురణార్ధం మిల్లర్లు సహకరించాలి… మహబూబాబాద్, డిసెంబర్,02. ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లను జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం దిగుమతి పై మిల్లర్లు తో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం దిగుమతి చేసుకోవడంలో మిల్లర్లు సహకరించాలని దిగుమతి వేగవంతంగా చేయించాలని కోరారు. జిల్లాలో రా రైస్ మిల్లులు, పార బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. ధాన్యంలో నాణ్యత ఉంటేనే కొనుగోలు చేస్తామని, ధాన్యం నాణ్యత పై ఎటువంటి…