ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 498 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Tags: Rangareddy
గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి
గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఎరువులు-విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, నివేశన స్థలాల అందజేత తదితర అంశాలపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ…
ఏ దరఖాస్తులైన పెండింగ్ లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనముల పెండింగ్ పనులను త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిపిఓకు మరియు సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. గృహాలక్ష్మి దరఖాస్తులను పరిశీలించాలని అన్నారు. జి.ఓ.59 పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. తహసీల్దార్లందరు తమ…
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు.
పారదర్శకంగా ఓటరు తుది జాబితా జాబితా పరిశీలకులు వాకాటి కరుణ ఓటరు నమోదు వివరాల పరిశీలన ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ హరీష్ తో కలిసి ఓటరు జాబితా పరిశీలకులు వాకాటి కరుణ ఈఆర్ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ…
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ హరీష్
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ హరీష్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ హరీష్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన గణేష్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆశాభావం వెలిబుచ్చారు.
విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం లో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, బీ.సీ సంక్షేమ శాఖ అధికారి నిర్మల దేవి, జిల్లా…
ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలాన్ లో ఆదివారం సమైక్యత దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ…
పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో సర్పంచులకు మంచి గుర్తింపు వచ్చిందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డితెలిపారు.
శుక్రువారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్-2023 సం॥ ఉత్తమ గ్రామలుగా ఎంపికైన గ్రామలకు అవార్డుల ప్రధానోత్సవం, జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రేగులరైజ్ ఉత్తర్వుల ప్రధాన కార్యక్రమమునకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమిష్టి కృషితోనే గ్రామీణాభివృద్ధిలో అద్భుత ఫలితాలు సిద్ధిస్తున్నాయని, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు.…
నియోజకవర్గాల వారీగా సమస్యాతామక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు
గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో రాబోవు సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాతామక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, అసెంబ్లీ నియోజకవర్గాల కోసం గుర్తించిన ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పై సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ పోలీసు కమిషనర్ డి.సి.చౌహాన్ లతో కలిసి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ…
ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించి లాభాల బాటలో పయనించాలని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు.
ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించి లాభాల బాటలో పయనించాలని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఉద్యానవనన మరియు పట్టు పరిశ్రమ శాఖ, వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన మరియు శిక్షణ సదస్సుకు జిల్లా కలెక్టర్ హరీష్ ముఖ్య అతిధిగా హాజరైనారు. జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమ…