జూన్ 2, 2021
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి. నరసింహ చార్యులు, శాసనసభ అధికారులు, సిబ్బంది.
జెండా ఆవిష్కరణకు ముందు శాసనసభ ప్రాంగణంలోని డా. బి ఆర్ అంబేడ్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు సభాపతి పోచారం గారు, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పూలు వేసి నివాళులర్పించారు.